Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సాహో'. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు.
యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 30న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. అంతేకాదు ఓ అరుదైన ఘనత ఈ సినిమా సొంతం కానుంది. యూరప్లోనే అతిపెద్ద థియేటర్గా పేరొందిన 'ది గ్రాండ్ రెక్స్'లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఇందులో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమాని వీక్షించవచ్చు. గతంలో ప్రభాస్ నటించిన 'బాహుబలి' సినిమాని కూడా ఇందులో ప్రదర్శించారు. అలాగే రజనీకాంత్ నటించిన 'కబాలి', విజరు 'అదిరింది' చిత్రాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. ఇక 'సాహో' చిత్రం నుంచి ఓ వీడియో గేమ్ని రూపొందించారు. దీన్ని 'సాహో ది గేమ్' పేరుతో ఇటీవల విడుదల చేశారు. నేడు (ఆదివారం) ఈ చిత్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఆర్ఎఫ్సీలో నిర్వహించనున్నారు. టైగర్ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, లాల్, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.