Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనిష్క్రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ, 'ఇటీవల థ్రిల్లర్ ప్రధానంగా వచ్చిన దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. ఆ కోవలోనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. నిర్మాత రాజీ పడకుండా చాలా క్వాలిటీగా సినిమాని నిర్మించారు. తప్పకుండా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. 'చాలా కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాం. దర్శకుడు రామకృష్ణ తెరకెక్కించిన తీరు పెద్ద అసెట్ అవుతుంది. రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలకు మించి ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్కి విశేష స్పందన లభిస్తోంది. చిత్ర విజయంపై నమ్మకంతో ఉన్నాం' అని నిర్మాత క్రాంతికిరణ్ వెల్లంకి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా:, సతీష్ముత్యాల, ఎడిటర్: సత్యగిడుతూరి, మ్యూజిక్ డైరెక్టర్: సిద్దార్ధ్ సదాశివుని.