Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో తమన్నా కీలక పాత్ర పోషిస్తుంది. సురేంద్రెడ్డి దర్శకత్వంలో నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో యుద్ధనారి లక్ష్మి పాత్రలో తమన్నా కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అందులో భాగంగా తమన్నా తన డబ్బింగ్ వర్క్ని పూర్తి చేశారు. 'హిందీ వెర్షన్ డబ్బింగ్ పూర్తయ్యింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగంగా కావడం, లక్ష్మిగా నటించడం అమేజింగ్ ఎక్స్పీరియెన్స్. త్వరలో సినిమాని థియేటర్లో చూడండి' అని తమన్నా తన ఆనందాన్ని ఫేస్బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా డబ్బింగ్ చెబుతున్నట్టుగా ఉన్న ఓ ఫొటోని షేర్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18న గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్మాత రామ్చరణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహేష్ బాబు హీరోగా రూపొందే 'సరిలేరు నీకెవ్వరు'లో ప్రత్యేక పాటలో తమన్నా మెరవనుంది. 'ఆగడు'లో వీరిద్దరు జోడీగా నటించి మ్యాజిక్ చేశారు. అలాగే తమన్నా నటించిన 'దట్ ఈజ్ మహాలక్ష్మి' విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో 'పెట్రోమాక్స్', 'యాక్షన్'తోపాటు హిందీలో 'బోల్ చుడియన్' చిత్రాల్లో నటిస్తూ తమన్నా బిజీగా ఉంది.