Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంజయ్ దత్ కెరీర్లో ఓ మైలురాయిగా, ఆయన్ని తిరుగులేని స్టార్గా నిలబెట్టిన చిత్రం 'ఖల్నాయక్'. 1993లో విడుదలై బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ఈ సినిమాకి సుభాష్ ఘారు దర్శకత్వం వహించగా, జాకీ షరాఫ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 26ఏండ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ముఖ్యంగా హీరో సంజరుదత్ ఈ సీక్వెల్ని తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే జాకీ షరాఫ్ పాత్ర కోసం ఆయన తనయుడు టైగర్ షరాఫ్ని కలిశారట. తన సొంత ప్రొడక్షన్లోనే ఈ సినిమా చేయాలని భావిస్తున్నారు. మరి ఈ చిత్రానికి సుభాష్ఘారు దర్శకత్వం వహిస్తారా? లేక కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు సంజరు దత్ కెరీర్లో నిలిచిన మరో చిత్రం 'మున్నాబారు ఎంబీబీఎస్'. 2003లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీనికి సీక్వెల్గా 2006లో 'లగే రహో మున్నాబారు' విడుదలై ఘన విజయం సాధించింది. వీటికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. గత కొంత కాలంగా దీనికి రెండో సీక్వెల్ 'మున్నాబారు ఎంబీబీఎస్ 3' చిత్రం తెరకెక్కించాలని భావిస్తున్నారు. దీనిపై తాజాగా సంజరు దత్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారట. 'స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో ప్రారంభిస్తాం. అర్షద్ వార్సి తన పాత్రలో నటిస్తారు' అని సంజరు దత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 2న గాంధీ జయంతికి 'లగే రహో మున్నాబారు' బృందం సందడి చేయబోతుంది. సంజరు దత్, విద్యా బాలన్, అర్షద్ వార్సి, బొమ్మన్ ఇరానీ, దిలిప్ ప్రభవాల్కర్ కలిసి ఓ ప్రత్యేక వీడియో చేశారు. దీన్ని గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.