Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెద్ద సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ సంతోషంగా ఉంటారు. అదే చిన్న సినిమా హిట్ అయితే ఇండిస్టీ బాగుంటుంది' అని దర్శకరత్న దాసరినారాయణరావు అన్నారు. రాజ్తరుణ్, అవికాగోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స, ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేష్.డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సినిమా చూపిస్తా మావ'. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రాన్ని చూసిన నేపథ్యాన్ని పురస్కరించుకుని దాసరి మాట్లాడుతూ, 'ప్రేక్షకులు గొప్పోళ్ళు. సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే చూడరు. 'బాహుబలి', 'శ్రీమంతుడు'లాంటి పెద్ద చిత్రాల హిట్ తర్వాత వచ్చిన 'సినిమా చూపిస్త మావ' కూడా అదే రేంజ్లో హిట్ అయ్యింది. ఈ హిట్ చిత్రాలతో ఇండిస్టీకి మంచి ఎనర్జీ వచ్చింది. మూడు నుండి నాలుగు కోట్లు పెట్టి తీసిన సినిమా సుమారుగా 15కోట్లు కలెక్ట్ చేయబోతోంది. సినిమాలో వచ్చే ప్రతి ఫ్రేమ్లో దర్శకుడే కనిపిస్తున్నాడు. ఇది టెక్నీషియన్ల పిక్చర్. టీమ్ ఎఫెర్ట్ పెట్టి చేసిన సినిమా. ప్రసన్న రాసిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. బడ్జెట్ లిమిటేషన్లో ఫొటోగ్రఫీ చక్కగా చేశారు. చాలా రోజుల తర్వాత సంతృప్తిగా ఫీలైన సినిమా ఇది. రాజ్తరుణ్ చాలా మెర్చ్యూర్డ్గా నటించాడు. అవికా అందంగా, క్యూట్గా ఉంది. రావురమేష్ చాలా బాగా నటించాడు. సినిమా చూసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి మరీ చెప్పాను. ఇలాంటి చిత్రాల్ని ఎంకరేజ్ చేస్తేనే ఇండిస్టీ కళకళలాడుతుంది' అని చెప్పారు.
'దాసరిలాంటి వారు మా సినిమాని, మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది' అని త్రినాథరావు నక్కిన, బెక్కం వేణుగోపాల్, ప్రసన్నకుమార్, తోటపల్లి మధు, సాయికృష్ణ తదితరులు అన్నారు.