Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, కీర్తి సురేష్ తొలి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ దశమి రోజున ప్రారంభమయింది. నాయకానాయికలు నితిన్, కీర్తి సురేష్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్నివ్వగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్ర స్క్రిప్ట్ను నిర్మాతలు దిల్రాజు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) దర్శకుడు వెంకీ అట్లూరికి అందజేశారు. వైభవంగా జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవంలో నిర్మాతలు జెమిని కిరణ్, సుధాకర్రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ''ఇదొక ప్రేమ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రానికి సుప్రసిద్ధ ఛాయా గ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది' అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు. 'ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన అందించబోయే స్వరాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. విజయ దశమి రోజున ప్రారంభమైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా నిరవధికంగా జరుగుతుంది. 2020 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. సీనియర్ నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : నవీన్ నూలి, కళ : అవినాష్ కొల్లా, అడిషనల్ స్క్రీన్ప్లే : సతీష్ చంద్రపాశం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.