Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిషేక్ రెడ్డి, భాను శ్రీ, ఆయేషా సింగ్, మేఘనా చౌదరి ప్రధాన పాత్రధారులుగా శ్యామ్ జె. చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఏడు చేపల కథ'. శేఖర్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్ర ట్రైలర్ని ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్యామ్ మాట్లాడుతూ, 'విడుదలైన టీజర్ని చూసి బూతు సినిమా అని, డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్స్ వచ్చాయి. టెంప్ట్ రవి పాత్రలో ఉండే అమాయకత్వం, వినోదం అందరిని ఆకట్టుకుంటాయి. అయితే 'శంకరాభరణం' లాంటి సినిమా చేశామని చెప్పడం లేదు. యూత్ని టార్గెట్ చేసి వినోదమే ప్రధానంగా తెరకెక్కించాం. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి రావద్దు' అని అన్నారు. 'యువతకి చక్కని సందేశాన్ని అందించేలా సినిమా ఉంటుంది. విమర్శించిన వారు కూడా సినిమాని చూశాక ప్రశంసిస్తారని నమ్ముతున్నా. నవంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని నిర్మాత శేఖర్రెడ్డి చెప్పారు. హీరోయిన్ ఆయేషా సింగ్ చెబుతూ, 'తెలుగులో నాకిది తొలి చిత్రం. అందరిని అలరించే చిత్రమవుతుంది' అని చెప్పారు.