Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో 'రొమాంటిక్' చిత్రం రూపొందుతుంది. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించబోతున్నారు. ఆ విశేషాలను చిత్ర బృందం చెబుతూ, ''బాహుబలి'లో రాజమాత శివగామి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమెది ఇందులో ఫుల్ లెన్త్ రోల్. మంగళవారం నుంచి జరుగుతున్న షెడ్యూల్లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారు. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్కి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా అంతకు మించి ఆకట్టుకుంటుంది' అని తెలిపింది. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నరేష్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్: జానీ షేక్.