Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రం 'ప్రతి రోజు పండగే'. హీరో సాయితేజ్ పుట్టిన రోజుని పురస్కరించుకుని మంగళవారం విడుదల చేసిన చిత్ర గ్లింప్స్కి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా యూనిట్ చెబుతూ, 'కుటుంబ అనుబంధాలు, ఎమోషన్స్, తాత, మనవడి మధ్య ఉన్న అనుబంధం తెలిపే చిత్రమిది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్లో సాయి తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. తాత, మనవడి మధ్య రిలేషన్ని అందంగా చూపించాం. సాయి తేజ్ని కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్లో చూపించబోతున్నారు. అలాగే సత్యరాజ్ పాత్ర, రావు రమేష్ రోల్ హైలైట్ అవుతాయి. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే వినోదం ఇందులో రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్ని అమెరికాలో షూట్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని డిసెంబర్ 20న గ్రాండ్గా విడుదల చేయనున్నాం. అందరికీ నచ్చే చిత్రం అవుతుంది' అని తెలిపింది.