Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది, కార్తీక్ రాజు, నిత్యా నరేష్, శషా చెట్రి, పార్వతీశం ప్రధాన పాత్రధారులుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. శుక్రవారం సినిమా విడుదలైన నేపథ్యంలో శనివారం సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయికిరణ్ అడవి చెబుతూ, 'సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. రెస్పాన్స్ చాలా బాగుంది. చాలా మంచి కథని తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు. సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అబ్బూరి రవి, నిర్మాత పద్మనాభరెడ్డి అందరికి ధన్యవాదాలు. రివ్యూస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సినిమాని మరింత పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'దేశభక్తి లోపల దాచుకుంటాం. కానీ పద్మనాభరెడ్డి బయటకు చెప్పడం బాగుంది. ఆయన సినిమాని విడుదల చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. రొమాంటిక్ పెయిర్ లేకుండా క్యారెక్టర్ని నమ్మి అర్జున్ పండిట్ పాత్రలో ఆది చాలా బాగా చేశారు. ఏ హీరోనైనా పాత్రలే నిలబెడతాయి. అర్జున్ పండిట్ పాత్ర ఆదిని నిలబెడుతుంది. రివ్యూస్ రాయాలి. రాయడం వల్లే మనం ఎలాంటి సినిమా తీశామో జనానికి అర్థమవుతుంది' అని అబ్బూరి రవి చెప్పారు. హీరో ఆది చెబుతూ, 'ఇందులో నా పాత్రకి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఇదొక డేర్ అటెమ్ట్ అని చాలా మంది ప్రశంసిస్తున్నారు. గర్వపడే సినిమా చేశాం' అని చెప్పారు.
'ఈ రోజుల్లో సినిమా తీయడం కష్టం, దాన్ని విడుదల చేయడం మరింత కష్టం. రివ్యూస్ వారం తర్వాత రాస్తే బాగుంటుంది. అలాగే సినిమాని మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నా' అని కార్తీక్రాజు తెలిపారు. 'రెస్పాన్స్ బాగుంది. కలెక్షన్లు పెరగాలి' అని పార్వతీశం అన్నారు. 'దేశభక్తి ప్రధాన నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎలాగైనా జనంలోకి తీసుకెళ్ళాలని ఎంతో శ్రమించాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. కాశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణాన్ని ప్రతిబింబించిన చిత్రమిది. ఇలాంటి సినిమాలని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను' అని నిర్మాత పద్మనాభరెడ్డి చెప్పారు.