Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రిషి క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ కొణిదెనని హీరోగా పరిచయం చేస్తూ హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం 'మళ్ళీ మళ్ళీ చూశా'. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు. ఈ చిత్రం ఈనెల 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ, ''చాలా సంవత్సరాలుగా దర్శకత్వ అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో నిర్మాత కోటేశ్వరరావుగారు వయసు కాదు. టాలెంట్ ఇంపార్టెంట్ అని నమ్మి అవకాశం ఇచ్చారు. అనురాగ్, నేను ఒక ఫ్యామిలీలా కలిసిపోయి ఈ సినిమా చేశాం. మా ఇద్దరి మధ్య అంత కో-ఆర్డినేషన్, కోఆపరేషన్ ఉంది కాబట్టే సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే మా డిఓపి కళ్యాణ్ టెక్నికల్గా చాలా సపోర్ట్ చేశారు. శ్రావణ్ భరద్వాజ్ తన సంగీతంతో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఎలేంద్ర మహావీర్ ఒక పెద్ద సినిమాలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. శ్వేతా అవస్థికి తెలుగు రాక పోయినా చాలా బాగా అర్ధం చేసుకుని నటించింది' అని అన్నారు. ''ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం మీడియా. దాదాపు 150 సినిమాలకు పిఆర్ఓగా చేశాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాలకు ఎప్పుడూ సపోర్ట్ చేసే మీడియాలో నేను ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. రాంబాబు, రాము అన్న ఈ ఇద్దరూ క్రిషి క్రియేషన్స్కి రెండు పిల్లర్స్. అందరూ కొత్తవారైనా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ వీకెండ్స్లో థియేటర్స్ పెంచుతున్నార. సినిమా ఇంకా మంచి విజయం సాధించాలి' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ పాలకుర్తి చెప్పారు. హీరో అనురాగ్ కొణిదెన మాట్లాడుతూ, ''మేము ఇక్కడ ఇంత బాగా మాట్లాడుతున్నాం అంటే మైత్రి రవిగారు, అనిల్ సుంకరగారు ఇచ్చిన సపోర్టే కారణం. ఈ సందర్భంగా వారిద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కసితో ఈ సినిమా చేశాం. మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి మీడియా మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా యాక్షన్, పెర్ఫామెన్స్ కొత్త హీరోలా లేదు అని రాసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దర్శకుడు కార్తీక్ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారు' అని అన్నారు.