Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ 'డిస్కో రాజా'. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన 'నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో' అంటూ సాగే ఫస్ట్ సింగల్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో బాల సుబ్రమణ్యం ఈ పాట పాడారు. పూర్తిగా రెట్రో ఫీల్ని కలిగించే ఈ పాటలో చాలా వ్యాల్యూస్ ఉన్నాయని విన్నవారంతా చెప్పటం విశేషం. ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.