Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. లైట్ హౌస్ మూవీ మేకర్స్ పతాకంపై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. రవితేజ నటిస్తున్న 66వ చిత్రమిది. ఇందులో కీలక పాత్ర కోసం తమిళ నటుడు సముద్రఖనిని ఎంపిక చేశారు. ఆ విశేషాలను యూనిట్ చెబుతూ, ''డాన్ శీను', 'బలుపు' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ కాంబినేషన్ రెడీ అవుతుంది. ఇందులో రవితేజ శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. దర్శకత్వం నుంచి నటన వైపు అడుగులేసి వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా మెప్పిస్తున్న సముద్రఖని ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. 'బలుపు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో శృతి హాసన్ మరోసారి నటిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం' అని తెలిపింది.