Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'క్రాక్' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్నివ్వగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, 'యాక్షన్ థ్రిల్లర్గా సినిమాని తెరకెక్కిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నాం. అన్ని వర్గాల ఆడియెన్స్ని మెప్పించే ఇంటెన్స్ స్టోరీ ఇది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాని విడుదల చేస్తున్నాం. 'డాన్ శీను', 'బలుపు' తర్వాత రవితేజ, మా కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కావడంతో అన్ని వర్గాల్లోనూ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. రవితేజ పాత్రలోని పవర్ని ప్రతిబింబించేలా ఈ టైటిల్ పెట్టాం. పాత్ర పరంగా ఆయన గడ్డం, మెలితిప్పిన మీసాలతో డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు. తన శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాడు' అని తెలిపారు.