Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్ దేవ్ హీరోగా పులివాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న చిత్రం 'సూపర్మచ్చి'. ఇందులో కథానాయికగా కన్నడ నటి రచితా రామ్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా యూనిట్ చెబుతూ, 'ఇటీవల ప్రకటించిన చిత్ర టైటిల్కి, ఫస్ట్లుక్కి మంచి స్పందన లభించింది. సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో కళ్యాణ్ దేవ్ సరసన కన్నడ నటి రచితా రామ్ని ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. విభిన్న కథాంశంతో అన్ని వర్గాల ఆడియెన్స్ని ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. ఇప్పటికే యాభై శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. కొత్త షెడ్యూల్ని ఈ నెల 22 నుంచి ప్రారంభించబోతున్నాం. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో సినిమాని విడుదల చేస్తాం' అని తెలిపింది. నరేష్, రాజేంద్రప్రసాద్, పోసాని, ప్రగతి, అజరు, మహేష్, షరీఫ్, సత్య ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: బ్రహ్మ కడలి.