Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్తరుణ్, మాళవిక నాయర్ జంటగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో 'ఒరేయ్బుజ్జిగా' చిత్రం రూపొందుతుంది. దీన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో మరో ఆకర్షణ తోడైంది. కీలక పాత్ర కోసం హేబా పటేల్ ఎంపికైంది. ఆ విశేషాలను నిర్మాత కె.కె.రాధామోహన్ తెలియజేస్తూ, 'మా బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. రాజ్తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా, కీలకమైన పాత్రలో 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో యూత్కి దగ్గరైన హీరోయిన్ హేబా పటేల్ నటిస్తున్నారు. మాళవిక, హేబా పటేల్ ఇద్దరి పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. కథ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్న హేబా పటేల్కు థ్యాంక్స్. తాజా షెడ్యూల్లో భాగంగా శుక్రవారం హేబా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఆమెపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. రొమాంటిక్ ఎంటర్టైనర్గా సినిమా రూపొందుతుంది. 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' వంటి చిత్రాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న విజయ్ కుమార్ కొండా ఈ చిత్రాన్ని మంచి వినోదాత్మకంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తున్నారు' అని అన్నారు. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.