Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్ర పరిశ్రమ సక్సెస్ చుట్టూ పరిగెడుతుంటుంది. హీరోలు సక్సెస్ కొట్టిన దర్శకులతో పనిచేయాలనుకుంటారు. దర్శకులు హిట్ కొట్టిన హీరోలతో సినిమాలు చేయాలనుకుంటారు. ఇక్కడ సక్సెస్ ప్రామాణికం. అది అనేక లెక్కలను మారుస్తుంది. కొత్త కాంబినేషన్లని సెట్ చేస్తుంది. మహేష్బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు'తో విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకున్నా, సంక్రాంతి సీజన్ కావడంతో కమర్షియల్గా సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలో తనకు మంచి మాస్ హిట్ని ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేయబోతున్నారు. వంశీపైడి పల్లి తర్వాతి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారని తెలుస్తుంది. 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ ప్రమోషన్లో బిజీగా ఉన్న మహేష్ మూడు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నారు. హాలీడేస్ని ముగించుకుని తిరిగి వంశీపైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో చివరగా 'మహర్షి' చిత్రం వచ్చిన విషయం విదితమే. త్వరలో రూపొందే ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని, ఎలాంటి సందేశాలుండవని మహేష్ తెలిపిన విషయం విదితమే.