Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'విలన్గా మంచి అవకాశాలొస్తున్నాయి. జగపతిబాబు అంతటి స్థాయికి చేరుకుంటావని చాలా మంది ప్రశంసించడం హ్యాపీగా ఉంది' అని అంటున్నారు డి.ఎస్.రావు. నిర్మాత నుంచి నటుడిగా మారి విలక్షణ పాత్రల్లో నటిస్తున్న డి.ఎస్.రావు ప్రస్తుతం 'శివ 143'లో విలన్గా నటించారు. సాగర్ శైలేష్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా డి.ఎస్.రావు మాట్లాడుతూ, 'నటుడిని కావాలని ఇండిస్టీకి వచ్చాను. అవకాశాల కోసం తిరిగే క్రమంలో నిర్మాతగా మారాల్సి వచ్చింది. రామ్లక్ష్మణ్లతో మూడు సినిమాలు తీశా. అవి మంచి విజయం సాధించాయి. దీంతో నిర్మాతగా కంటిన్యూ అయ్యాను. మనీ మ్యాటర్స్పై దృష్టి పెరిగి యాక్టింగ్ పక్కకు పోయింది. నిర్మాతగా కొన్ని ఫ్లాప్లు రావడంతో మళ్ళీ తిరిగి నటన గురించి ఆలోచించాను. ఈ క్రమంలో ఓసారి దర్శకుడు తేజని కలిసినప్పుడు ఆయన గుండుతో ఉన్న నన్ను చూసి 'నా నెక్స్ట్ సినిమాలో విలన్ నువ్వే' అన్నారు. ఆశ్చర్యపోయా. నిజంగానే 'హోరాహోరి'లో విలన్ పాత్ర ఇచ్చారు. అప్పట్నుంచి నటుడిగా కొనసాగుతున్నా. ఈ క్రమంలో పలు మంచి పాత్రలు దక్కాయి. ఇప్పటి వరకు తెలుగు, హిందీ, కన్నడ కలిపి 32 చిత్రాల్లో నటించా. ఈ చిత్ర నిర్మాత టి.రామసత్యనారాయణతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆ రిలేషన్తో ఇందులో నటించాను. కానీ దర్శకుడు సాగర్ నన్ను భయంకరమైన విలన్గా తీర్చిదిద్దారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యాను. సాగర్ మంచి కథ రాసుకున్నాడు. తన ప్రియురాలు విలన్ వల్ల సమస్యల్లో ఇరుక్కున్న నేపథ్యంలో దాన్ని హీరో ఎలా సాల్వ్ చేశాడనే కథాంశంతో సినిమా సాగుతుంది. విలన్గా నా పాత్ర బాగా పండుతుందని నమ్ముతున్నా. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది. నాకు మంచి పేరొస్తుంది. సాగర్కి మంచి భవిష్యత్ ఉంది. మున్ముందు బోయపాటి శ్రీను, పూరి జగన్నాధ్ వంటి దర్శకులతో పని చేయాలని ఉంది. త్వరలో వారి సినిమాల్లో నటిస్తాను. ప్రస్తుతం 'కమిట్మెంట్', 'నయీమ్ డైరీస్', 'ఆనందభైరవి' వంటి చిత్రాల్లో నటిస్తున్నా. నటుడిగా మంచి బ్రేక్నిచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఇక నిర్మాతగా ఈ ఏడాది ఓ పెద్ద సినిమా తీయాలనుకుంటున్నా' అని తెలిపారు.