Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి
మేక పరమేశ్వరరావు(70) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. పరమేశ్వరరావు మృతితో
హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
1948 మార్చి 16న కృష్ణా జిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్నాటకలోని గంగావతి జిల్లా బసవ పాలెంకి వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. శ్రీకాంత్ హీరోగా రాణిస్తున్న విషయం అందరికి తెలిసిందే. శ్రీకాంత్ తండ్రి మరణ వార్త తెలిసి పలువురు సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిరంజీవితోపాటు పలువురు శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కుటుంబానికి చిరంజీవి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.