Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నటిగా నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. భవిష్యత్లో దర్శకురాలిని కావాలనుంది. అలాగే మహేష్బాబు, రామ్చరణ్, అల్లు అర్జున్లతో కలిసి నటించాలనుంది' అని అంటోంది దిగంగన సూర్యవంశీ. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం 'వలయం'. లక్ష్ హీరోగా రమేష్ కడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ దిగంగన సూర్యవంశీ మంగళవారం మీడియాతో ముచ్చటిస్తూ, ''నా గత చిత్రం 'హిప్పి'తో పోల్చితే ఇందులో భిన్నమైన పాత్రలో కనిపిస్తాను. చాలా ఇన్నోసెంట్గా, పక్కింటి అమ్మాయిగా కనిపిస్తాను. అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటాను. ఇంతలో నేను మిస్ అవుతాను. మరి నా మిస్సింగ్కి కారణమేంటి? దాన్ని హీరో ఎలా ఛేదించాడనేది సినిమా. 'దిశ' ఘటన తర్వాత నా పాత్రకి దిశ అని పేరు పెట్టారు. నా మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఓ వలయంలో హీరో ఇరుక్కుంటాడు. ఆ మిస్టరీ చుట్టూనే ఆయన ఆలోచనలుంటాయి. దాన్నుంచి బయటపడలేకపోతాడు. అందుకే ఈ చిత్రానికి 'వలయం' అనే పేరు పెట్టారు. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం కాన్సెప్ట్. సినిమాకి కథే కింగ్. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. కమర్షియల్ సినిమాలాగానే అనిపిస్తుంది. బేసిక్గా నాకు కమర్షియల్ చిత్రాలంటే ఇష్టం. కానీ వాటిలో చేసేందుకు అంతగా ఇష్టపడను. కథ మొత్తం నా పాత్ర చుట్టూతే తిరుగుతుంది. దీంతో నాకంటూ ఓ ఐడెంటిటీ వస్తుంది. లక్ష్కి సినిమా అంటే ఎంతో ప్యాషన్. గతంలో ఆయన పలు చిత్రాల్లో నటించారు. రీఎంట్రీ ఇస్తూ హీరోగా పరిచయం అవుతున్నారు. 'హిప్పి' పరాజయం చెందినప్పుడు కామన్గానే తీసుకున్నా. ఎందుకంటే మన పాత్ర వరకు మనం బాగా చేయగలం. రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. దానికి చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. నా పాత్రకి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం గోపీచంద్ సరసన 'సీటీమార్'లో నటిస్తున్నా. మరో చిత్రానికి చర్చలు జరుగుతున్నాయి. రైటింగ్ నాకిష్టం. రెండు సినిమా స్క్రిప్ట్లు కూడా రాశాను. వీటిని కొంతమంది దర్శకులకి కూడా నెరేట్ చేశాను. ఓ స్టేజ్కి వచ్చాక దర్శకత్వం చేయాలనుకుంటున్నా. దీంతోపాటు అనేక పాటలు కూడా రాశాను. రైటింగ్ అనేది మన సోల్లాంటిది. నటన ఆ సోల్లో జీవించడం లాంటిది. రెండూ వేరు' అని తెలిపింది.