Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్, దిగంగన సూర్యవంశీ జంటగా రమేష్ కడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వలయం'. ఈ నెల 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో లక్ష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'చిన్నప్పుడు మూడు చిత్రాలు బాల నటుడిగా, నాలుగు సినిమా ల్లో హీరోగా నటించాను. ఆ తర్వాత సింగపూర్ వెళ్ళిపోయి, అక్కడ ఎంబీఏ చేశా. తర్వాత వ్యాపారం చేసుకుంటూ 'బిచ్చగాడు' సినిమాని తెలుగులో విడుదల చేశాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓ మంచి సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ స్క్రిప్ట్ని డైరెక్టర్ రమేష్ చెప్పాక కొన్ని మార్పులు చేశాం. ఇందులో నా పాత్ర పేరు అరవింద్. నా భార్య మిస్ అవుతుంది. ఓ వైపు నేను, మరో వైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాం. హీరోయిన్ పేరు దిశా అయినప్పటికీ 'దిశా' ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. ఆ ఘటనకు ముందే డబ్బింగ్తో సహా మా సినిమా పూర్తయ్యింది. మా సినిమా తీయడం, అది జరగడం యాదృశ్చికం. సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్కి గురవుతారు. కంటెంట్ బాగున్న సినిమాలను ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఇందులో కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారని నమ్మకం ఉంది. హీరోగానే కాకుండా నిర్మాతగా బాగా ఇన్వాల్వ్ అయి చేశా. హీరోగా చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఈ పాత్ర కోసం 20 కేజీలు తగ్గాల్సి వచ్చింది. సాధారణంగా నటనకు బ్రేక్ వస్తే మళ్ళీ రాణించడం కష్టం. కానీ సినిమాల పట్ల నాకున్న ప్యాషన్ వల్లే మళ్ళీ నటించగలిగాను. అందుకు నాన్న(చదలవాడ శ్రీనివాసరావు) సపోర్ట్ మరువలేనిది. మేం ఇండిస్టీలో చాలా రోజులుగా ఉన్నాం. ఈ క్రమంలో చాలా బ్లాక్బస్టర్స్ని వదులుకున్నాం. 'బిచ్చగాడు' సినిమా మేము ఇండిస్టీలో ఉన్నందుకు దక్కిన గిఫ్ట్. అదొక వండర్గా భావిస్తున్నాం' అన్నారు.