Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్' చిత్రం రూపొందుతుంది. రుహానీ శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ, 'నాని హీరోగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా 'అ!' వంటి డిఫరెంట్ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడు మరో భిన్నమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన గట్స్కి అభినందనలు. హీరోగా కమర్షియల్ సినిమాలు చేయాలని, నిర్మాతగా ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించాలని కోరుకుంటున్నా. ప్రశాంతిగారికి అభినందనలు. డైరెక్టర్ శైలేంద్ర తండ్రి శేషగిరి రావుకి మాతో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. వాళ్ళబ్బాయి శైలేష్ కథ రెడీ చేశాడు వినమని చెప్పారు. నాకు స్క్రిప్ట్ చెప్పేసి శైలేష్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కట్ చేస్తే, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నానని చెప్పాడు. నాని సహా అందరినీ ఎగ్జైట్ చేసేలా స్క్రిప్ట్ చెప్పి ఉంటాడనిపించింది. ట్రైలర్ చూస్తుంటే ఆసక్తికరంగా ఉంది. థియేటర్కు వెళ్లాలనే ఆసక్తి కలుగుతుంది. విశ్వక్ మంచి ఆర్టిస్ట్ అని నిరూపించుకున్నాడు. 'ఫలక్నుమాదాస్'ను డైరెక్ట్ చేసి, నిర్మించి, నటించి పెద్ద హిట్ కొట్టాడు. తను నిజంగా టాలెంటెడ్. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటున్నాను. నైజాం, వైజాగ్లలో మేమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు. 'సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే నెక్ట్స్ ఏంటనేది ఓ టెన్షన్ ఉంటుంది. శైలేష్ ఈ సినిమా కథ చెప్పగానే మరేం ఆలోచించకుండా ఓకే చేసేశాను. తను నెరేట్ చేసేటప్పుడే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా ఎంజారు చేశాను. ఈ సినిమాకి యాక్టింగ్ తప్ప మరేమీ చేయలేదు. ఎందుకంటే నాకు శైలేష్ మీద అంత నమ్మకం ఉండింది. అలాగే సినిమాటోగ్రాఫర్ మణికందన్ నన్ను చాలా బాగా చూపించారు. నిర్మాత ప్రశాంతిగారికి థ్యాంక్స్. సాధారణంగా హీరోయిన్స్ను నిర్మాతలు జాగ్రత్తగా చూసుంటారని చెబుతుంటారు. అలా ఓ హీరోయిన్లా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం' అని విశ్వక్సేన్ తెలిపారు. డైరెక్టర్ శైలేంద్ర మాట్లాడుతూ, 'ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. ట్రైలర్లో చూసిన దానికంటే సినిమాలో ఎక్కువ ఎక్స్పీరియెన్స్ చేస్తారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడియెన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చునేలా చేసే థ్రిల్లర్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నానిగారికి, ప్రశాంతిగారికి' అని చెప్పారు. 'వినగానే స్క్రిప్ట్ నచ్చింది. దాదాపు రెండేండ్లు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ కంటెంట్ అందరికి కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని నిర్మాత ప్రశాంతి తెలిపారు.