Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. నెక్ట్స్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టు చిత్ర బృందం బుదశారం అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' చిత్రం చేశారు. ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్లో సినిమాని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రమిది కావడం విశేషం. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్'లో నటిస్తున్నారు. రామ్చరణ్ మరో హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ నటి అలియాభట్, ఒలివియా మోర్రీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత'లో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, 2018లో విడుదలైంది.