Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయకుడు విజరు సరసన మరోసారి నటించే బంపర్ ఆఫర్ని కాజల్ అందుకున్నట్టు సమాచారం. విజరు, ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందబోయే 'తుపాకీ' సీక్వెల్లో నాయికగా కాజల్ని ఎంపిక చేశారట. 'తుపాకీ'లోనూ విజరు, కాజల్ జోడి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన విషయం విదితమే. ఓ పక్క విజరుతోను మరో పక్క చిరంజీవితోనూ నటించటానికి కాజల్ రెండు రోజుల గ్యాప్తో రెండు సినిమాలకు గ్రీన్సిగల్ ఇవ్వడం విశేషం.
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆచార్య' లోనూ కాజల్ ఎంపికైంది. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఈచిత్ర షూటింగ్ వాయిదా పడింది.
కాజల్ వీటితోపాటు 'ముంబయి సాగా', 'ఇండియన్ 2' చిత్రాల్లోనూ నటిస్తోంది. మొత్తమ్మీద కాజల్ నటిస్తున్న 4 చిత్రాలూ భారీ చిత్రాలే కావడం మరో విశేషం.