Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ బయోపిక్ని తెరకెక్కించేందుకు
సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ప్రముఖ కర్నాటక గాయని,
మహిళా హక్కుల పోరాట యోధురాలు బెంగుళూరు నాగ రత్నమ్మ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి సింగీతం ప్లాన్ చేస్తున్నారు. అయితే బెంగుళూరు నాగరత్నమ్మగా అనుష్కని ఎంపిక చేయాలనే యోచనలో ఆయన ఉన్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలొచ్చాయి. అయితే లేటెస్ట్గా ఈ పాత్ర కోసం చిత్ర బృందం సమంతని సంప్రదించిందని సమాచారం. మహిళా ప్రాధాన్యత ఉన్న బయోపిక్ కావడం,
కథని సింగీతం నెరేట్ విధానం నచ్చి సమంత ఈ ప్రాజెక్ట్లో నటించడానికి సుముఖంగా ఉందని తెలుస్తోంది. దీంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే
ఈ బయోపిక్లో సమంత దాదాపు ఖరారైనట్టేనని చిత్ర బృందం భావిస్తోంది.
సమంత ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే, తొలుత అనుష్క సైతం 'బెంగుళూరు నాగరత్నమ్మ'గా నటించేందుకు గ్రీన్సిగల్ ఇచ్చిందట. అయితే కమల్హాసన్ రిక్వెస్ట్ మేరకు 'రాఘవన్' సీక్వెల్లో నటించడానికి అనుష్క అంగీకరించిందని తెలుస్తోంది. దీంతో 'రాఘవన్' సీక్వెల్ కోసం అనుష్క ఈ బయోపిక్ నుంచి తప్పుకుందని అర్థమవుతోంది. కమల్హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'రాఘవన్'. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ఘన విజయం సాధించింది. ఈచిత్రానికి సీక్వెల్గా 'రాఘవన్ 2' ని రూపొందించేందుకు కమల్హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది.