Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పాటిస్తున్న లాక్డౌన్తో షూటింగులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 'కరోనా క్రైసిస్ చారిటీ' (సి సి సి)కి ప్రభాస్ రూ.50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభాస్ ఇది వరకే కరోనా నిర్మూలన
చర్యల కోసం పిఎమ్ రిలీఫ్ ఫండ్కి 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు (50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్ సహాయ నిధికి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీఎమ్ సహాయ నిధికి) సహాయం అందించిన విషయం విదితమే. అల్లు అర్జున్ సైతం రూ.20 లక్షలు, యు.వి.క్రియేషన్స్ అధినేతలు రూ.10 లక్షలు, సందీప్కిషన్ రూ.3 లక్షలు, సుశాంత్ రూ.2 లక్షలు, షైన్ స్క్రీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా రూ. 5 లక్షలు, బ్రహ్మాజీ రూ. 75 వేలు, నిర్మాత కరాటం రాంబాబు రూ. లక్ష, నారా రోహిత్ రూ.30 లక్షల రూపాయలు కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) మన కోసం సంస్థకు విరాళంగా అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే, రాజశేఖర్ తన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 300 మంది పేదలకు ఆహార పొట్లాలను అందజేశారు. అలాగే దర్శకుడు సతీష్ వేగేశ, సినిమాటోగ్రాఫర్స్ సమీర్రెడ్డి, ప్రసాద్ మూరెళ్ళ రూ. 50 వేల రూపాయల చొప్పున తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్కి విరాళంగా ప్రకటించారు.
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రస్తుత పరిస్థితి గురించి,
ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన వీడియో సాంగ్కి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. సంగీత దర్శకుడు కోటి ఈ పాటను స్వరపరచగా, ఈ సాంగ్లో చిరంజీవి, నాగార్జున, వరుణ్తేజ్, సాయితేజ్ నటించారు.