Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో కథానాయికల తీరు చాలా మారింది. గతంలో మాదిరిగా మూస ధోరణి పాత్రలు చేయడం లేదు. పాత్ర నచ్చితే అది చిన్నదా, పెద్దదా అని కూడా చూడటం లేదు. పైగా ఆ పాత్రకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసేందుకు బాగా శ్రమిస్తున్నారు. అలాగే పూర్తి స్థాయి మహిళా చిత్రాల్లో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కథ, కథనం, పాత్రకి ఉన్న ప్రాధాన్యత ఈ మూడు విషయాలు నచ్చితే చాలు సదరు సినిమాలో నటించడానికి కథానాయికలు గ్రీన్సిగల్ ఇచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా తమన్నా కూడా ఈ తరహాలోనే ఓ బాలీవుడ్ సినిమాకి పచ్చజెండా ఊపారు. వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేశ్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బుజ్జమ్మగా నటించి అందరినీ మెప్పించింది తమిళ కథానాయిక మణాలినీ రవి. అయితే ఇప్పుడు హిందీ రీమేక్లో బుజ్జమ్మ పాత్ర కోసం తమన్నా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో నటించేందుకు తమన్నా కూడా అంగీకరించిదట. తెలుగులో అథర్వ పోషించిన అభిలాష్ పాత్రలో నటించేందుకు 'భాగ్ మిల్కా ఫేమ్' ఫర్హాన్ అక్తర్, వరుణ్ తేజ్లో కొత్త షేడ్ చూపించిన 'గద్దలకొండ గణేశ్' పాత్రలో అజరు దేవ్గన్ నటించడానికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం గోపీచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న తమన్నా బాలీవుడ్ బుజ్జమ్మగా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.