Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా, టెలివిజన్ షూటింగ్లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వడంతో పాటు షూటింగ్లకు ఉచితంగా లోకేషన్స్ ఇస్తునందుకు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, ఎపీఎఫ్డిసి చైర్మన్ విజరు చందర్కి, ఎపీఎఫ్డిసి ఎండీ విజరుకుమార్
రెడ్డికి ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అధ్యక్షుడు ప్రసాద్రావు మాట్లాడుతూ,'హైదరాబాదులో పరిశ్రమ ఉన్నప్పటికీ కనీసం రెండు షెడ్యూల్స్ ఆంధ్రప్రదేశ్లోని అందమైన లోకెషన్స్లో చిత్రీకరిస్తున్నాం. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతులు కొంచెం కష్టంగా ఉండేవి. జగన్ ప్రభుత్వం వచ్చాక, విజరు చందర్ గారి సహకారంతో టీవీ ఇండిస్టీకి ఉపయోగపడే జీవోను తీసుకురావడం విశేషం. అన్ని ప్రభుత్వ ప్రదేశాలలో ఉచితంగా చిత్రీకరణ చేసుకునే అవకాశం ఇవ్వడంతో పాటు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసిన ఏపీ సర్కార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం' అని చెప్పారు.
'ఏపి ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలంగాణా ప్రభుత్వం కూడా ఉచితంగా లోకేషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని నిర్మాత డివై చౌదరి అన్నారు. ఈ సమావేశంలో ఎస్. సర్వేశ్వరరెడ్డి, యాట సత్యనారాయణ, గుత్త వెంకటేశ్వరరావు, అశోక్ నలజాల, టీవీ పెటర్నిటి రాందాస్ నాయుడు పాల్గొన్నారు.