Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వల్ల లాక్డౌన్ ప్రకటించిన దగ్గర్నుంచి ఏదో ఒక రూపంలో 'వి' సినిమా వార్తల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలుస్తూనే ఉంది.
నాని, సుధీర్బాబు కథానాయకులుగా ఇంద్రగంటి మోహన కష్ణ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన చిత్రమిది. చాలా రోజులుగా ఈ సినిమా ఓటీటీలో విడుదలవ్వ బోతుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్ని ఖండిస్తూ హీరోలు, దర్శక, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని కూడా గట్టిగా చెప్పారు. అమెజాన్ లాంటి ఓటీటీ సంస్థ రూ.25 కోట్ల ఆఫర్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారనే వార్తలూ హల్చల్ చేశాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అల్లుఅరవింద్కి చెందిన 'ఆహా' ఓటీటీ సంస్థ దిల్రాజుకు ఏకంగా రూ. 30 కోట్ల రూపాయల్ని ఆఫర్ చేసిందని సమాచారం. అయితే ఈ ఆఫర్కు దిల్రాజు పచ్చజెండా ఊపారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, నాని ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వీటిల్లో ఒకటి 'టక్ జగదీష్', మరొకటి 'శ్యామ్ సింగరారు'. వీటిల్లో 'టక్ జగదీష్' సినిమా చిత్రీకరణ ఇప్పటికే కొంత పూర్తయ్యింది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. త్వరలోనే చిత్రీకరణ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అలాగే 'శ్యామ్ సింగరారు' సినిమాలో నానితో మరోసారి సాయిపల్లవి కలిసి నటించబోతోందనే వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో సాయిపల్లవితోపాటు మరో ఇద్దరు కథానాయికలు కూడా నటించబోతున్నారట. పీరియడ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.