Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆమె' సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు దూరమైన అమలాపాల్ ఓ బంపర్ ఆఫర్ని దక్కించుకున్నట్టు సమాచారం. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కథానాయికగా అమలాపాల్ని ఎంపిక చేశారని వినిపిస్తోంది. అయితే ఇప్పటికే అనుష్క, కాజల్, త్రిష, నయనతార, తమన్నా.. ఇలా చాలా పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా చిత్ర బృందం అమలాపాల్ని ఫిక్స్ చేసిందట. ఇదే నిజమైతే తొలిసారి బాలయ్య సరసన అమలాపాల్ నటించనుందన్నమాట. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం బీబీ3 ఫస్ట్రోర్ పేరుతో విడుదల చేసిన టీజర్కి మంచి ఆదరణ లభించింది. అలాగే యూ ట్యూబ్లోనూ ట్రెండింగ్లో నెంబర్ 1 పొజిషన్ని సాధించింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణను ప్రారంభించ బోతున్నారు. గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో 'సింహ', 'లెజెండ్' చిఆలు రూపొందిన విషయం తెలిసిందే.