Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. లాక్డౌన్ కారణంగా నిలిచిన పోయిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే ఇందులోని ఓ కీలక పాత్రలో రామ్చరణ్ నటించబోతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మలయాళంలో మంచి విజయం సాధించిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. చిరంజీవి కథానాయకుడిగా 'సాహౌ' దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా సుజీత్ మార్పులు చేస్తున్నారట. అయితే ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా (లూసిఫర్ ఒరిజినల్లో మోహన్లాల్ సోదరిగా మంజు వారియర్ నటించారు) ఇప్పటికే విజయశాంతి, సుహాసిని, ఖుష్బు పేర్లు వినిపించాయి. తాజాగా చిరంజీవికి సోదరిగా రోజా నటించనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే చిరంజీవి సోదరి రెండో భర్తగా (మంజు వారియర్ రెండో భర్తగా చేసిన వివేక్ ఒబెరారు పాత్రలో) జగపతిబాబును అనుకుంటున్నారట.
ఇక 'లూసిఫర్' సినిమాలో చిత్ర దర్శకుడు పథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం చిత్రయూనిట్ విజరు దేవరకొండను సంప్రదించినట్లుగా సమాచారం. తొలుత ఈ పాత్ర విషయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరు వినిపించింది. మోహన్లాల్ అనుచరుడిగా పథ్వీరాజ్ సుకుమారన్ ఆ చిత్రంలో కొంచెం సేపు మాత్రమే కనిపించినా.. అతని పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. పాత్రకి ఉన్న ప్రాధాన్యతతోపాటు యూత్లో విజరుదేవరకొండకి ఉన్న క్రేజ్ని కూడా దృష్టిలో పెట్టుకుని చిరంజీవికి అనుచరుడిగా విజరు దేవరకొండ సరిగ్గా సరిపోతారనే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ఏదిఏమైనా 'లూసిఫర్' రీమేక్లో సరికొత్త కాంబినేషన్లను చూడ్డం ఖాయమని వేరే చెప్పక్కర్లేదు.