Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సాంకేతికంగా ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా అవేవీ థియేటర్కి సాటిరావు అని, థియేటర్ ఎప్పటికీ థియేటరే' అని అంటున్నారు యువ నిర్మాత ఎస్కేఎన్. విజరు దేవరకొండ కథానాయకుడిగా నిర్మించిన 'టాక్సీవాలా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత ఎస్కేఎన్ పుట్టినరోజు నేడు (మంగళవారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
'టాక్సీవాలా'తో బ్లాక్బస్టర్ హిట్ అందుకోవడం, అలాగే టీవీలో ప్రసారమైన ప్రతీసారి మంచి రేటింగ్స్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తర్వాత మారుతి, సాయితేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ప్రతి రోజు పండగే'తో సహ నిర్మాతగా మరో మంచి విజయాన్ని అందుకోవడం ఆనందాన్నిచ్చింది. ఇదే ఉత్సాహంతో ఓ ప్రముఖ కథానాయకుడితో మారుతి దర్శకత్వం వహించబోయే మరో సినిమాకి కూడా సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నాను. అలాగే మారుతి పర్యవేక్షణలో రూపొందబోయే వెబ్సిరీస్కి నిర్మాతగానూ బాధ్యతలు నిర్వర్తించనున్నాను. సాయి రాజేష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాను. వీటితోపాటు 'టాక్సీవాలా' దర్శకుడు రాహుల్తో మరో సినిమాని తెరకెక్కించడానికి రంగం సిద్ధం అవుతోంది. రాహుల్ ప్రస్తుతం నాని కథానాయకుడిగా 'శ్యామ్ సింగరారు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే మా సినిమాని స్టార్ట్ చేస్తాం. అలాగే అల్లుశిరీష్ హీరోగా రూపొందే సినిమాకి కూడా సహ నిర్మాతగా ఉండబోతున్నాను. ప్రస్తుతం కరోనా వల్ల ఓటీటీల్లో సినిమాలు విడులవుతున్నాయి. అయితే ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సినీ పరిశ్రమకి ఏమీ కాదు. సినిమా అనేది ఎవర్ గ్రీన్. వీసీిఆర్లు, టీవీలు ఇలా టెక్నాలజీలు ఎన్ని వచ్చినప్పటికీ థియేటర్కి వెళ్లి సినిమా చూడటం అనేది ఆడియన్స్ ఆపలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే థియేటర్కి వెళ్లి సినిమా చూడటం అనేది ఓ ఎమోషన్. అన్ని వర్గాలు
వారికి అందుబాటులో ఉండే ఏకైక ఎంటర్టైన్మెంట్. ఏవో కొన్ని మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నంత మాత్రానా తెలుగు సినిమాని తక్కువ అంచనా వేయకండి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఎలా సత్తా చాటిందో అందరికీ తెలుసు. స్నేహితులు బన్నీవాసు, మారుతి దగ్గర్నుంచి సినిమా కథలు, మేకింగ్కి సంబంధించి మెళకువలు నేర్చుకుంటున్నాను' అని ఎస్కేఎన్ చెప్పారు.