Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగునాట సైతం రియాలిటీ షోలకు మంచి క్రేజ్ ఉంది. బుల్లితెర ప్రేక్షకులు ఈ రియాలిటీ షోలను విపరీతంగా ఆదరిస్తున్నారు. దీంతో ఈ షోస్తోపాటు ఈ షోస్కి హౌస్ట్ చేసే సెలబ్రిటీలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. బుల్లితెరపై సంచలనం సష్టించిన 'బిగ్బాస్' షో కొత్త సీజన్గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ. 'బిగ్ బాస్' సీజన్ 4కి అగ్ర కథానాయిక సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోందనే వార్తలు ఈ మధ్య కాలంలో బాగా వినిపించాయి. అయితే లేటెస్ట్గా యువ కథానాయకుడు విజరు దేవరకొండ పేరు వినిపిస్తోంది. బిస్ బాస్ కొత్త సీజన్ కోసం సదరు షోకి సంబంధించిన ప్రతినిధులు
ఇటీవల విజరు దేవరకొండని కలిసినట్టు సమాచారం. 'అర్జున్రెడ్డి' తర్వాత విజరుకి యూత్లో బాగా ఫాలోయింగ్ వచ్చింది. అలాగే దీని తర్వాత ఆయన నటించిన సినిమాలు సైతం మంచి ఆదరణ పొందడంతో పరిశ్రమలో స్టార్డమ్ కూడా వచ్చింది. దీంతోపాటు తాను నటించిన సినిమాలకు వినూత్న రీతిలో పబ్లిసిటీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకోవడంలో కూడా విజరు సక్సెస్ అయ్యారు.
అలాగే కరోనా వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునేందుకు విజరు తన ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మిడిల్క్లాస్ ఫండ్కి మంచి ప్రశంసలు లభించాయి. ఈ ఫండ్ ద్వారా కొన్ని వేల మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందాయి. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబ ప్రేక్షకులకు కూడా విజరు బాగా దగ్గరయ్యారు. దీంతోపాటు విజరు చేస్తున్న సేవా కార్యక్రమానికి పరిశ్రమలోని ప్రముఖ సెలబ్రిటీలు సైతం మద్దతు ఇచ్చారు. అలాగే పలువురు ఆర్థిక సాయం చేసి అండగానూ నిలబడ్డారు.
ఈ నేపథ్యంలో విజరుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని బిగ్బాస్ షో నిర్వాహకులు ఆయన్ని కలిసినట్టు తెలుస్తోంది. అంతేకాదు విజరు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు షో నిర్వాహకులు భారీ మొత్తాన్నే పారితోషికంగా ఇవ్వబోతున్నారట.
ఇదిలా ఉంటే, విజరు ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజరు సరసన బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే నటిస్తోంది.