Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా మహమ్మారి మాలాంటి నిర్మాతలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో సినిమాలను థియేటర్లో రిలీజ్ చేస్తామనే నమ్మకం నిర్మాతల్లో రోజు రోజుకి సన్నగిల్లుతోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రామసత్యనారాయణగారి 'ఎటీటీ' రూపంలో మా సినిమాని రిలీజ్ చేసుకునేందుకు మార్గం దొరికింది. అది కూడా ఎటువంటి పబ్లిసిటీ ఖర్చు లేకుండా రిలీజవ్వడం నాలాంటి నిర్మాతలకు ఎంతో ఉపయోగ పడుతుంది' అని అంటున్నారు నిర్మాత శ్రీనివాస్. కేతన్, ప్రాచీ సర్కార్ హీరో హీరోయిన్లుగా ఆయన రూపొందించిన సినిమా 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు'. ఈనెల 12వ తేదీన భీమవరం టాకీస్ ఎటీటీ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మీడియాతో సంభాషించిన విశేషాలు ఆయన మాటల్లోనే..
'వరంగల్లో బిజినెస్ చేసుకునే నేను ఆర్టిస్టు కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చాను. ఓ 5 సినిమాల్లో కూడా యాక్ట్ చేేశాను. ఫ్రెండ్స్ సపోర్ట్తో 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' సినిమాని తీసాను. ఫస్ట్కాపీ వచ్చిన తర్వాత చాలా మందికి చూపించాను. చిన్న బడ్జెట్ సినిమాలకి ఆదరణ తక్కువగా ఉండటం వల్ల బిజినెస్ జరగలేదు. ప్రింట్స్, పబ్లిసిటీ మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ పెడతామన్నారు. ఎక్కువ సినిమాల విడుదల వల్ల నాకు థియేటర్లు దొరక్క విడుదల చేయలేకపోయాను. పబ్లిసిటీకి కనీసం 20 లక్షల ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు తిరిగి వస్తుందని గ్యారంటీ లేక సినిమాని విడుదల చేయలేదు. ఓ రోజు సడన్గా రాంగోపాల్ వర్మ 'క్లైమాక్స్' సినిమాని ఎటీటీ ద్వారా విడుదల చేయటం చూసి, ఇంకా ఎవరైనా ఎటీటీ పెడతారా అని ఎదురు చూశాను. ఆ టైమ్లో భీమవరం టాకీస్ సంస్థ అధినేత రామ సత్యనారాయణ ఎటీటీని పెడుతున్నట్టు తెలిసి, వెళ్లి కలిశాను. అయితే ఆయన తన సినిమాల కోసమే ఎటీటీ పెట్టానని చెప్పారు. మీ ఏటీటీలో మా సినిమాని రిలీజ్ చేసి ప్రయోగం చేయమని రిక్వెస్ట్ చేసాను. నాకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన తన సినిమాని కూడా పక్కన పెట్టి మా సినిమాని ఈనెల 12 వ తేదీన 10 గం.లకు విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత 11 గంటలకు ఆయన సినిమా 'శివ 143'ని రిలీజ్ చెయ్యబోతున్నారు. నాలాంటి చిన్న సినిమాలకి ఇదీ 100% కరెక్ట్ వేదిక అని భావిస్తున్నా. ఒక్క పైసా ఖర్చు కూడా లేదు. ఎంత వస్తే అంతా కూడా డైరెక్ట్గా నా చేతికే రావడం సంతోషంగా ఉంది. ఇది మాలాంటి చిన్న నిర్మాతలకు మంచి శుభపరిణామం' అని చెప్పారు.
'ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్న కేతన్, ప్రాచీ సర్కార్ హీరో హీరోయిన్లుగా బాగా నటించారు' అని సహ నిర్మాత గుర్రపు విజరు కుమార్ తెలిపారు.
కేతన్, ప్రాచీ సర్కార్, గోపికర్, బి.ఎస్.ఆర్. జ్యోతి, ఐశ్వర్య, గుర్రపు విజరు కుమార్, డాక్టర్ గురు ప్రసాద్, అశోక్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: అశోక్ కుమార్ పోలన, కెమెరామెన్: బి.ఎస్.కుమార్, మ్యూజిక్: విరించి, ఎడిటర్: అజరు కొడం, సహా నిర్మాత: గుర్రపు విజరు కుమార్.