Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రుద్రమదేవి'తో దర్శక, నిర్మాతగా గుణశేఖర్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుని, త్వరలోనే ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా 'హిరణ్యకశ్యప'ను ప్రారంభించ బోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'సొగసు చూడతరమా' చిత్రం నేటితో (మంగళవారం) 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నరేష్, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అవడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన నాలుగు నంది అవార్డులను సాధించింది. ఉత్తమ చిత్రంగా బంగారు నందిని అందుకున్న ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా కూడా గుణశేఖర్ అవార్డుని అందుకున్నారు. బెస్ట్ డైలాగ్ రైటర్ నంది అవార్డును అజరు శాంతి, బెస్ట్ కాస్ట్యూమ్స్ నంది అవార్డును కుమార్ తీసుకున్నారు. 'సొగసు చూడతరమా' సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శక, నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ, 'సొగసు చూడతరమా' చిన్న చిత్రంగా నిర్మించినా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు. అంతేకాకుండా ఉత్తమ చిత్రంగా బంగారు నంది రావడం, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా నాకు, బెస్ట్ డైలాగ్ రైటర్గా అజరు శాంతికి, కాస్ట్యూమ్స్కి కుమార్కు కూడా నంది రావడం ఆ సినిమా దర్శక,నిర్మాతగా ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల రివార్డ్స్ను, ప్రభుత్వ అవార్డ్స్ను అందుకుని నా సినీ జీవితంలో అన్ని విధాలా సంతప్తిని కలిగించి, ఒక స్వీట్ మెమరీగా నిలిచిన 'సొగసు చూడతరమా' 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, అవార్డ్స్ ఇచ్చి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు' అని తెలిపారు.