Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాలో ఎటువంటి ఆందోళన, భయాలు లేవు. ఎందుకంటే మనకు అర్థం కావాల్సింది ఒకటే. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఈ అనంత విశ్వంలో కేవలం మానవ మాత్రులమే అనేది తెలుసుకోవాలి. ఈ కరోనా సంక్షోభం నేర్పే పాఠం అదే. ప్రకతి కంటే మనం ఏమాత్రం గొప్పవాళ్లం కాదు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నిబ్బరం కోల్పోకూడదు. రేపటి నమ్మకంతో జీవించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న సమాజానికి, పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలు చేయాలి' అని అంటోంది రకుల్ ప్రీతి సింగ్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రకుల్ కూడా కరోనా లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితం అయ్యింది. అయినప్పటికీ ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటుందనే పాజిటివ్ దృక్పథంతో ఉన్నానని అంటోంది రకుల్. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు రకుల్ సమాధానమిచ్చింది. 'పుస్తకాలు బాగా చదివాను. సినిమాలు, వెబ్సిరీస్లు లెక్కలేనన్ని చూశాను. అయితే యోగా, ధ్యానం చేసేందుకు ఇంకొంత సమయాన్ని కేటాయించా. ఆన్లైన్లో మేనేజ్మెంట్ క్రాష్ కోర్సులు చేశా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, స్టాక్స్, షేర్మార్కెట్ల గురించి మరింత లోతుగా తెలుసుకున్నా.
నన్ను నేను బిజీగా ఉంచుకోవడంకోసం కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి ప్రయారిటీ ఇచ్చా. వీటితోపాటు ఆశావహ దృక్పథాన్ని అలవర్చటం బాగా నేర్చుకున్నా. మీరూ ధైర్యంగా, పాజిటివ్గా ఉండానికి ప్రయత్నించండి'
అని రకుల్ తెలిపింది.