Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్ : కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పత్రికలు సంక్షోభంలో పడ్డాయి. ప్రకటనల ఆదాయం విపరీతంగా పడిపోయింది. ఈ సంక్షోభ పరిస్థితి నుంచి బయటపడేందుకు జర్మన్ వార్తా పత్రికలు పోరాడుతున్నాయి. డిజిటల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, మీడియాపై ప్రజల విశ్వాసం ఉంచడం జర్మన్ పత్రికలకు కలిసొచ్చింది. ఇతర దేశాలతో పోల్చితే జర్మనీలో న్యూస్ పేపర్ ఇండిస్టీ పరిస్థితి పర్వాలేదని మీడియా నిపుణులు మోనిక్యూ హాఫ్సమాన్ పేర్కొన్నారు. ఇతర యూరోపియన్ దేశాల కంటే జర్మనీలోనే అధిక సంఖ్యలో పత్రికలు అమ్ముడవుతున్నాయని చెప్పారు. సమాచారం కోసం పాఠకుల నుంచి డిమాండ్ తగ్గక పోగా మరింత పెరిగిందని ఆమె అన్నారు. కొత్తగా ఉత్పన్నమైన పరిస్థితుల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే పత్రికా పరిశ్రమ సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కోవడమేగాక, మరింత బలమైన శక్తిగా ఎదగవచ్చని అన్నారు. ఓ జర్మనీలోని 10 ప్రధాన పత్రికల్లో ఒకటి మాత్రమే పాఠకుల సంఖ్యను కోల్పోయిందని అసోసియేషన్ ఆఫ్ జర్మన్ న్యూస్ పేపర్స్ పబ్లిషర్స (బిడిజడ్వి) నివేదిక పేర్కొంది. పావు శాతం అమ్మకాలు స్ధిరంగా ఉన్నాయని తెలిపారు.