Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.7.5 లక్షల కోట్లకు చేరిన సంపద
వాషింగ్టన్ : ఫేస్బుక్ సిఇఒ మార్క్ జుకర్బర్గ్ మొదటిసారిగా సెంటీ బిలియనీర్స్ క్లబ్లో చేరారు. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఫేస్బుక్ షేర్లు భారీగా లాభపడటంతో జుకర్ బర్గ్ సంపద 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.5 లక్షల కోట్లు) దాటింది. ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయిన చైనీస్ యాప్ టిక్టాక్కు చెక్ పెడుతూ షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ రీల్స్ను ఫేస్బుక్ బుధవారం అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. దీంతో గురువారం ఆ కంపెనీ షేరు దూసుకెళ్లింది. ఇప్పటికే సెంటీ బిలియనీర్స్ జాబితాలో ఉన్న జెఫ్ బెజోస్, బిల్గేట్స్ సరసన జుకర్బర్గ్ చేరారు. కొత్త ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తేవ డంతో ఫేస్బుక్ షేర్ ఏకంగా 6.5 శాతం పెరిగి 265 డాలర్ల ఎగువన ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. దీంతో ఫేస్బుక్లో 13 శాతం వాటా కలిగిన జుకర్బర్గ్ వ్యక్తిగత సంపద తొలిసారి 100 బిలియన్ డాలర్లను తాకింది. టిక్టాక్కు పోటీగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. టిక్టాక్పై తాజాగా అమెరికా అధ్యక్షుడు నిషేద గడువును విధించడంతో రీల్స్కు డిమాండ్ పెరుగుతుందనే అంచనాల్లో మదుపర్లు ఫేస్బుక్ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు.