Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైరోబి: సోమాలియా రాజధాని మొగాదిషులో సైనిక స్థావరం వద్ద శనివారం కారు బాంబు పేలడంతో 8మంది సైనికులు మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడి తామే చేసినట్లు ఆల్ఖైదాతో సంబంధం ఉన్న అల్సబాబ్ గ్రూప్ తన రేడియో ఛానెల్ అండాలస్ ద్వారా వెల్లడించింది. ఆర్మీ క్యాంపు గేటు బయట ఉన్న కారు ద్వారా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని కెప్టెన్ మహ్మద్ హుస్సేన్ తెలిపారు.