Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొలీవియా ఎంఎఎస్ డిమాండ్
సుక్రే : చర్చల ద్వారా నిర్ణయించిన ఎన్నికల తేదీని మాత్రమే తాము ఆమోదిస్తామని, అది కూడా చట్టప్రకారం హామీ ఇవ్వాలని బొలీవియాకు చెందిన మూవ్మెంట్ టూవార్డ్స సోషలిజం(ఎంఎఎస్) పేర్కొంది. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎం ఎఎస్కు చెందిన అధ్యక్ష అభ్యర్ధి లూయిస్ అర్కె, ఉపాధ్యక్ష పదవి అభ్యర్ధి డేవిడ్ చోక్వహుయాన్కా మాట్లాడుతూ బొలీవియాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు మార్పుల్లేని ఎన్నికల తేదీని సుప్రీం ఎలక్టోరల్ కోర్టు(టిఎస్ఇ) ప్రకటించాలన్నారు. విద్య హక్కు, ఆర్థిక సంక్షోభం బొలీవియా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయని, ఇవి వారిని మరింత దిగ్భందాలకు గురిచేసిందని అన్నారు. సెప్టెంబర్ 6న ఎన్నికలు నిర్వహించాలని గత ఆరు రోజులుగా కార్మిక వర్గ సంఘాలైన సెంట్రల్ ఒబ్రేరా బొలివియానా(సిఓబి), యునిడాడ్లు రహదారుల, జాతీయరహదారుల దిగ్భందిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. టిఎస్ఇ ఇప్పటికే నాలుగు సార్లు ఎన్నికల తేదీని మార్పు చేసింది. తాజాగా అక్టోబర్ 18న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది.