Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెలారస్ ప్రతిపక్ష నేత టికనోవ్స్కాయా వెల్లడి
మిన్సక్ : పిల్లల కోసం దేశం విడిచివేళ్లాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బెలారస్ ప్రధాన ప్రతిపక్ష నేత స్వెట్లానా టికనోవ్స్కాయా పేర్కొన్నారు. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అధికార పక్షం ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడిందని ఆమె ఆరోపిస్తున్నారు. మంగళవారం ఒక యూట్యూబ్ వీడియోలో ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రచారం నిజంగా తనను చాలా ఉక్కిరిబిక్కిరి చేసిందని, దేనినైనా ఎదుర్కొనేంత శక్తిని ఇచ్చిందని అన్నారు. పిల్లలు, వారి భవిష్యత్తు చాలా విలువైనదని, తాను దేశం నుంచి విడిచి వెళ్లడంలో ఎవరి ప్రమేయం లేదని పేర్కొన్నారు. 65 ఏండ్ల టికనోవ్స్కాయా సోవియట్ బెలారస్ను 1994 వరకు పాలించారు. స్వెట్లానా టికనోవ్స్కాయా లూథియానాలో క్షేమంగానే ఉన్నట్లు దేశ విదేశాంగ మంత్రత్వ శాఖ పేర్కొంది. ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకసెంకోకు 80 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో మోసం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల తీరును వ్యతిరేకిస్తూ గత రెండు రోజులుగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళన కారులకు, పోలీ సులకు మధ్య ఘర్షణ ఘటనలు చోటు చేసుకుం టున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జితో పాటు పలువిధాలుగా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. రెండో రోజు రాత్రి కొనసాగిన ఆందోళనల్లో ఒకరు మరణించారు.