Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతి వేగంగా క్షీణిస్తున్న జంతుజాలం
- డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక హెచ్చరిక
వాషింగ్టన్ : గత 50ఏండ్ల కన్నా తక్కువ కాలంలోనే వన్య ప్రాణుల సంఖ్య మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగానే క్షీణించింది. అడవులు నరికివేయడం, విశృం ఖలంగా వినియోగించుకోవడం ఇందుకు ప్రధాన కారణా లుగా చెప్పుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందుగా ప్రకృతిని రక్షించు కోవడం చాలా ముఖ్యమని వారు హెచ్చరించారు. మానవ కార్యకలాపాల వల్ల మూడువంతుల భూమి, 40శాతం సముద్రాలు క్షీణించాయనీ, ప్రకృతి విధ్వంసం వేగంగా జరుగుతున్న కొద్దీ ప్రజల జీవనంపై, వారి ఆరోగ్యంపై లెక్కకు మిక్కిలి పర్యవసానాలు కలుగుతాయని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) గురువారం తన వార్షిక నివేదికలో హెచ్చరించింది. 4వేలకు పైగా వెన్నెముక గల జీవుల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. 1970-2016 మధ్య కాలంలో వన్యప్రాణుల సగటు క్షీణత 68శాతం వరకు వుందనీ, అడవులను నరికివేయడాన్ని పెరగడం, వ్యవసాయ విస్తరణ దీని వెనుక గల ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. గత 30ఏండ్ల కాలంగా తాము పర్యవేక్షిస్తున్నామనీ, క్షీణత అనేది బాగా ఎక్కువగా వుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంతర్జాతీయ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబర్టిని మీడియాకు తెలిపారు. 2016లో 60 శాతం క్షీణత వుందని గుర్తించాం, ఇప్పుడు అది 70శాతానికి పెరిగిందన్నారు. ఆస్ట్రేలియాలో సంభవించిన దావానలాల వల్ల 300కోట్ల జంతువులు చనిపోవడమో లేదా ఇతర ప్రాంతాలకు పారిపోవడమో జరిగిందన్నారు. మంచినీటి జలాల్లో వుండే జంతుజాలాలు కూడాఈ భూమ్మీద జంతుజాలం నివసిస్తున్న కోట్ల సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ అనర్ధమంతా రెప్పపాటు పాలంలో జరిగినట్లేనని లాంబర్టిని వ్యాఖ్యానించారు. జులాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ సహకారంతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ ఈ నివేదికను రూపొందించారు. ప్రకృతి ఆవాసాలు కోల్పోతుండడం వల్ల మానవులు వన్య ప్రాణులకు దగ్గరగా జీవించాల్సి వస్తుందని అటువుంటి సమయంలో కరోనా వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఎక్కువని ఆ నివేదిక హెచ్చరించింది. ఈ నివేదిక రూపకల్పనలో 125మంది నిపుణులు పాలు పంచుకున్నారు.