Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐరాస 75వ వార్షికోత్సవ సమావేశంలో పునరుద్ఘాటించనున్న జిన్పింగ్
బీజింగ్ : మెరుగైన ప్రపంచం కోసం బహు పాక్షికతలకు, పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి కట్టుబడి ఉండాలి... 2015లో న్యూయార్కులో జరిగిన ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశాలకు హాజరైనప్పుడు చైనా అధ్యక్షుడు సి జిన్పింగ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తూ చేసిన వ్యాఖ్యలు. ఈ సమావేశాలు జరిగి ఐదేండ్లు గడిచాయి. ఇవేవీ జరిగినట్టు కనిపించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఐదేండ్లలో పెరిగిన ఏకపక్షవాదం, తీవ్రమౌతున్న కరోనా మహమ్మారి ప్రభావం సమయంలోనే ఐరాస తిరిగి 75 వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.
ఇటువంటి సమయంలో అంతర్జాతీయ సమాజానికి ఐరాసను కేంద్రంగా నిలబెట్టడం, ఏకపక్షవాదాన్ని తిరస్కరించడం, తదితర అంశాల్లో జిన్పింగ్ గతం కంటే మరింత బలంగా తన అభిప్రాయాన్ని, వాదనను ప్రపంచానికి వినిపించడంపై దష్టి పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వారంలో ప్రారంభమయ్యే ఐరాస 75వ వార్షికోత్సవ ఉన్నతస్థాయి వరుస సమావేశాల్లో జిన్పింగ్ వీడియో లింక్ ద్వారా పాల్గొననున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశాల్లో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సమావేశం, ఐరాస జనరల్ అసెంబ్లీ 75వ సెషన్లో సాధారణ చర్చ(డిబేట్) ఉంటుంది. గత ఐదేండ్ల కాలంలో అంతర్జాతీయ అనేక మార్పులు వచ్చాయనీ, అమెరికా వంటి దేశం తీసుకున్న అమెరికా ఫస్టు అన్న నినాదం అంతర్జాతీయ క్రమాన్ని బలహీనపరిచిందనీ, కరోనా వంటి తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభంపై వివిధ దేశాలు స్పందించిన తీరు దేశాల మధ్య ఉన్న విభజనను మరింత విసతం చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్వాంగ్డంగ్ యూనివర్సిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్ అధ్యక్షుడు జోరు ఫాంగ్యిన్ మాట్లాడుతూ బహుపాక్షికతకు తమ మద్దతులను పునరుద్ఘాటిస్తూ చైనా ఇప్పటికే పలు సమావేశాల్లో పేర్కొందనీ, ఇదే సమయంలో ప్రపంచ పాలన, అంతర్జాతీయ క్రమంలో ఐరాస, డబ్ల్యూటీఓ వంటి సంస్థ సంస్థ పాత్రను నొక్కిచెప్పిందని అన్నారు.
చైనా, అమెరికాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దష్ట్యా రెండు దేశాల సంబంధాలలో వ్యూహాత్మక స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు చైనా తన విధానాలు, చొరవను ఐరాస సమావేశాల్లో వివరించే అవకాశం ఉందనీ, ఇది వీరిద్దరి మధ్య నెలకొన్న ప్రతికూల ప్రభావాలను నివారించవ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.