Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జకార్తాలో కార్మికవర్గం కన్నెర్ర
- భారీ సంఖ్యలో యువత ఆందోళన
- 'జాబ్ క్రియేషన్ బిల్లు'కు వ్యతిరేకంగా నినాదాలు
- వాటర్ కెనాన్లు... రబ్బర్బుల్లెట్లతో అడ్డుకునేయత్నం
కార్మికుల ఓట్లతో అధికారంలోకి వచ్చాక.. కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలను అమలు చేయటానికి పాలకులు వెనకాడటంలేదు. ప్రయివేటీకరణ ఒప్పంద బిల్లులతో మాబతుకులు ఆగమవుతాయని కార్మికలోకమంతా గళమెత్తుతున్నా.. అధికారం, మందబలంతో బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ఇండోనేషియాలో ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. ఇటు విద్యుత్ ప్రయివేటీకరణ బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీ సంకీర్ణ సర్కారు కొలువైన త్రిపురలోనూ కార్మికశక్తి కదంతొక్కింది. ఈ రెండు చోట్ల కార్మికవర్గంపై అధికార పార్టీలు ఉసిగొల్పటంతో.. ఖాకీలు రెచ్చిపోయారు.
జకార్తా : ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం నిరసనలు వెల్లువెత్తాయి. నగరంలోని పలు వీధులు యూనివర్సిటీ విద్యార్థుల నినాదాలతో మారుమోగాయి. బడా వ్యాపారులు, కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించిన 'జాబ్ క్రియేషన్ బిల్లు'కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. కార్మిక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇండోనేషియా అంతా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ వివాదస్పద చట్టం కార్మికుల హక్కులిన హరించ టమే కాకుండా పర్యావరణానికీ హాని కలిగిస్తున్నదని ఆక్షేపిస్తున్నారు. ఈ బిల్లును ఇండోనేషియా పార్లమెంట్ సోమవారం ఆమోదించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గురువారం మధ్యాహ్నం రాజధాని జకార్తాలో ప్రజలంతా ప్లకార్డులు, బ్యానర్లు ప్రద ర్శిస్తూ వీధుల్లోకి వచ్చారు. ముఖ్యంగా కాలేజీ యువత నగరంలోని పలు కూడళ్లలో ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన ర్యాలీ చేపట్టింది. నిరసనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్లు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించింది. ప్రజా ఆందోళన చూసైనా...దేశాధ్యక్షుడు ఈ బిల్లుపై ఆమోదముద్ర వేయడనే ఉద్దేశంతో అధ్యక్ష భవనం సమీపంలో నిరసనకు దిగామని విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు. ప్రజల ఆకాంక్ష, యువత ఆందోళన ఆయన అర్థం చేసుకుం టారనే ఉద్దేశమే తప్ప, హింసను సృష్టించటం తమ లక్ష్యం కాదని వారు చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం(జాబ్ క్రియేషన్ బిల్లు)లో కార్మిక వ్యతిరేక అంశాలతో నిండి వున్నదనీ, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనల్ని అడ్డుకోవడానికి ఇండోనేషియా ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాల్ని మోహరించింది. బ్యారికెడ్లు ఏర్పాటుచేసి నిరసనకారుల్ని అడ్డుకున్నారు. అనేక చోట్ల నిరసనకారులపై టియర్గ్యాస్ ప్రయోగించారు. పార్లమెంట్ భవనం సమీపంలో శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులు బలప్రయోగానికి దిగారు. నిరసనల్లో పాల్గొన్న పలువురికి గాయాలయ్యాయి.