Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త కరోనా కేసులతో చైనాలోని క్వింగ్డావో
- నగరంలో అధికారులు అప్రమత్తం
బీజింగ్: చైనా తూర్పు ప్రాంత నగరమైన క్వింగ్డావోలో భారీస్థాయిలో కరోనా పరీక్షల కార్యక్రమాన్ని అధికారులు సోమవారం ప్రారంభించారు. ఐదు రోజుల్లో 90 లక్షల మంది నగర నివాసులకు టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోమవారం నాడు ప్రారంభమైన ఈ పరీక్షలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారిలో పలువురిలో కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో నగరవాసులందరికీ పరీక్షలు చేయాలని స్థానిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా స్థానికులు కరోనా పరీక్ష కోసం క్యూలలో నిలబడిన చిత్రాలు ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. రద్దీ దష్ట్యా కొన్ని కరోనా పరీక్షా కేంద్రాలు ఆదివారం రాత్రి నుంచే పనిచేయడం ప్రారంభించాయి.
తీర ప్రాంత నగరమైన క్వింగ్డావోలో ఇటీవల కొత్తగా ఆరు కొత్త కరోనా కేసులు, మరో ఆరు లక్షణాలు కేసులు నిర్ధారణ కావడంతో అధికారులు ఎమర్జెన్సీ స్పందనగా ఈ పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చి క్వింగ్డావోలోని చెస్టు హాస్పిటల్లో చేరిన వారితో లింక్ ఉన్నయే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ కరోనా రోగులు నివసించే నివాస ప్రాంతాలు, వారు సందర్శించిన హాస్పిటళ్లను మూసివేశారు.,
కంటెయిన్మెంట్ చర్యల్లో భాగంగా హాస్పిటల్లో లాక్డౌన్ చేశారు. చైనాలో గోల్డెన్ వీక్ హాలిడే సందర్భంగా లక్షలాది మంది దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత టెస్టింగ్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. క్వింగ్డావోలో కరోనా పరీక్షల వార్తపై సమీప నగరమైన జినాన్ స్పందించింది. సెప్టెంబర్ 23 నుంచి ఆ నగరాన్ని సందర్శించిన వారు పరీక్ష చేయించుకోవాలని సూచించింది. లియోనింగ్ ప్రావిన్సలోని దలియాన్ నగర అధికారులు ట్రావెల్ అలర్టు జారీ చేశారు. సెప్టెంబర్ 27 నుంచి ట్రావెల్ రికార్డు చూయించాలని పౌరులను ఆదేశించింది.