Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మంది మృతి
- 100 మందికి పైగా గాయాలు
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో ఆదివారం జరిగిన కారు బాంబు పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఘోర్ నగరంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘోర్ రాష్ట్ర పోలీస్ చీఫ్ కార్యాలయం ప్రవేశానికి దగ్గరగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రాంతంలో ఇంకా అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయని అంతగ్గరత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనకు ఇంకా ఎవ్వరూ బాధ్యత ప్రకటించలేదు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే సహాక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. గాయపడిన వారి సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.