Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : శ్రీకష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగులెస్స అని తెలుగు భాష గొప్పతనాన్ని చాటారు. కాగా, ఇప్పటికాలంలో తెలుగుదేముంది అని.. అంతా ఇంగ్లీషుకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల్ని తెలుగులో ముద్రించనుంది. అమెరికాలో తెలుగువారు ఎక్కువమందే నివసిస్తున్నా రు. వారిని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమౌ తుంది. అమెరికాలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రపంచ భాషల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తారు. ఇప్పుడు వాటి సరసన తెలుగు కూడా చేరింది. అమెరికాలో తెలుగు భాషను అధికార భాషగా గుర్తించడం ద్వారా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారం తెలుసుకో వడానికి సులువుగా ఉంటుంది. అధికార కార్యకలాపాల వివరాలను కూడా తెలుగులో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 కోట్లమంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. కాగా.. అమెరికాలో తెలుగుభాషకు దక్కిన గౌరవంపట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షంవ్యక్తం చేస్తున్నారు.