Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాద జాబితాలో సూడాన్ ను తొలగిస్తాం : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
కైరో : ఉగ్రవాద బాధితులకు, వారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తే సూడాన్ను ఉగ్రవాద ప్రొత్సహాక(స్పాన్సర్) దేశాల జాబితా నుంచి తొలగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ఆయన ట్వీట్ చేశారు. దీనికి సూడాన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం 335 మిలియన్ డాలర్లను బాధితులకు చెల్లించాలన్నారు. ఉగ్రవాదానికి అమెరికాలో అనేక మంది బాధితులుగా మిగిలారని, బాధితుల్లో ఈ ఒప్పందంపై అసంతప్తి ఉన్నా తాము ఈ చర్య చేపడుతామని అన్నారు. ఈ చర్యతో అమెరికా ప్రజలకు న్యాయం జరుగుతుందని, సూడాన్ ప్రభుత్వానికి కీలకమైన అడుగుగా మారుతుందని అన్నారు. ఉగ్రవాద జాబితా నుంచి పేరు తొలగిస్తే అంతర్జాతీయ రుణాల పొందడంతో పాటు ఇతర విధమైన సాయం కూడా అందుతున్నారు. దీంతో సూడాన్ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవచ్చునని, దేశ ప్రజాస్వామ్య పరివర్తనను కాపాడుకోవచ్చని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్న సమయంలో ట్రంప్ నుంచి ఇటువంటి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సూడాన్ వంటి అరబ్ దేశాలను యునైటెడ్ అరబ్ ఎమిరైట్సలో చేర్చేందుకు అమెరికా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బ్రహెయిన్ ఇటీవల అమెరికా సన్నిహిత ఇజ్రాయిల్ను గుర్తించింది. ఇజ్రాయిల్తో సాధారణ సంబంధాలను నెరిపేందుకు సూడాన్కు అమెరికా ఈ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తోంది.