Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయమందించడానికి సిద్ధమంటూ హామీ
హనోయ్ : సెంటల్ వియత్నాంలో రికార్డు స్థాయిలో సంభవించిన వరదల వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో చైనా, లావోస్, సింగపూర్, థాయిలాండ్ లతో సహా పలు దేశాల నేతలు విచారం వ్యక్తం చేస్తూ, సానుభూతి సందేశాలు పంపారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్ గురువారం వియత్నాం ప్రధానికి ఈ మేరకు టెలిగ్రామ్ పంపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్లు కూడా బాధితులకు తమ సానుభూతి తెలియచేస్తూ టెలిగ్రామ్లు పంపారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ తరపున సానుభూతి తెలియచేస్తున్నామంటూ బాలకృష్ణన్ ఆ టెలిగ్రామ్లో పేర్కొన్నారు. కాగా ఏ సాయం అవసరమైనా చేయడానికి తాము సిద్ధంగా వున్నామని సింగపూర్ హామీ ఇచ్చింది. సెంట్రల్ వియత్నాం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై లావోస్ పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు బున్హంగ్ విచారం వెలిబుచ్చారు. 6, 7 కేటగిరీల్లోని తుపానులు వరుసగా వియ్నతాం సెంట్రల్ ప్రావిన్స్లను తాకుతుండడంతో భారీ సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ పరిస్థితుల్లో అవసరమైతే సాయమందించడానికి సిద్ధంగా వున్నామని లావోస్ నేతలు తెలిపారు.