Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలపై ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు 15మంది విద్యార్ధులను అరెస్టు చేశాయి. వీరిలో 11మంది భారత్కు చెందినవారే. బోస్టన్, వాషింగ్టన్, హస్టన్, నెవార్క్, నాషవిల్లె, పిట్స్బర్గ్, హారిస్బర్గ్లలో ఈ విద్యార్ధులను బుధవారం అరెస్టు చేశారు. 11మంది భారతీయ విద్యార్ధులతో పాటుగా ఇద్దరు లిబియన్లను, సెనెగల్ జాతీయుడు ఒకరిని, బంగ్లాదేశ్ జాతీయుడినొకరిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు అరెస్టు చేశారు. అమెరికాలోనే వుండేందుకు గానూ ఆప్షనల్ ప్రాక్టికిల్ ట్రెయినింగ్ (ఓపీటీ) కార్యక్రమాన్ని అక్రమంగా ఉపయోగించుకుంటున్న వలసయేతర విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుని ఐసీఈ అధికారులు చేపట్టిన ఆపరేషన్ ఆప్టికల్ ఇల్యూజన్ కింద ఈ అరెస్టులు జరిగాయి. ఓపీఈలో చేరే వలసయేత విద్యార్ధులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో అమెరికాలో ఏడాది పాటు పనిచేయడానికి వీలు వుంటుంది. ఒకవేళ సదరు విద్యార్ధి సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేథమెటిక్స్ (స్టెమ్) సబ్జక్టుల్లో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకుంటే మరో 24మాసాలు అక్కడ అదనంగా వుండవచ్చు. అసలు ఉనికిలోనే లేని కంపెనీల్లో వీరు పనిచేస్తున్నట్లు చెప్పారని ఐసీఈ తెలిపింది. చాలామంది అమెరికన్లు పనుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇటువంటి వారు ఇలా అక్రమంగా ఉద్యోగం సంపాదించుకోవడం తీవ్రమైన నేరమని తాత్కాలిక డిప్యూటీ కార్యదర్శి కెన్ కుకినెలి తెలిపారు. విద్యార్ధి వీసా వ్యవస్థను అడ్డుపెట్టుకుని మోసం చేనయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని తాజా అరెస్టులతో అర్ధమవుతోందని అన్నారు.